పూర్వము భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణితో ఉన్న తన భార్మ పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్లాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూచాడు. ఆ రాక్షసుడికి పులోము మీద మోహం కలిగింది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు.
ఇప్పుడు అగ్ని సంకటం లో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే ఆ రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.
కాని ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువుకు ఇచ్చి చేసాడు. ఆమె పులోమ అని
తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అని భయం. అదీ కాక, నిజం చెబితే ముని శాపం ఇస్తాడు. అబద్దం చెబితే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు.
కాని అన్న తదోషమును పోగొట్టు కొనడం సాధ్యం కాదు. అని అనుకొన్నాడు.
పులోముని చూచి అగ్ని ఇలా అన్నాడు. “ఈమె భృగుమహర్షి భార్య పులోమ”అని చెప్పాడు.
పులోముడు ఆమెను గుర్తు పట్టాడు. తాను మొదట వివాహం చేసుకోదలచిన లలన ఆమే అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమను బుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా, ఆ అదురుకు ఆమెకు ప్రనసం అయింది. బిడ్డ కింద పడ్డాడు. అలా గర్భం నుండి జారిన వాడు కాబట్టి వాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భంనుండి జారి పడిన చ్యవనుడు కళ్లు తెరవ గానే ఆ తీక్ష తకు తట్టుకోలేక పులోముడు అనే ఆ రాక్షసుడు భస్మం అయ్యాడు.
అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్లనుండి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రహించింది. ఆ నదికి వధూసర
అని బ్రహ్మనామకరణం చేసాడు.
ఈ లోపల భృగువు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టున్న తన కుమారుని, భార్యను చూచాడు. జరిగింది తెలుసుకున్నాడు. “అసలు నీవు పులోమ అనీ, నా భార్య అనీ ఆ రాక్షసునికి ఎలా తెలిసింది. ఎవరు చెప్పారు?” అని అడిగాడు.
“నాధా! ఈ అగ్ని దేవుడు నా పేరు పులోమ అనీ, నేను తమరి భార్య అనీ చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని బుజం
మీదపెట్టుకొని పరుగెత్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల ఈ బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మము అయ్యాడు.” అని చెప్పింది పులోము.
భృగువుకు కోపం వచ్చింది. “నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసికూడా వాడికి నా
భార్యగురించి చెప్పావు. అందుకని నీవు సర్వభక్షకుడివి అగుదువు గాక” అని అగ్నిదేవుని శపించాడు.
అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అన్నాడు. “మహాఋషీ! తనకు తెలిసిన విషయాన్ని దాచి పెట్టి అబద్దం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు
తెలుసుకదా! నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగువు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మ సాక్షిని. అటువంటి
నేను అబద్దం ఎలా చెప్పగలను.
కాని నా తప్పు ఏమీ లేకపోయినా నీవు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేని వాడను కాను
కదా! కాని, కొట్టినా, తిట్టినా, పరుషమైన మాటలు పలికినా, ఉత్తమ
బ్రాహ్మణులు పూజ్యులే కదా! అలాంటి బ్రాహ్మణులకు అపకారము చేస్తే నాకు ఇహము,పరమూ రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు! నీవు కూడా ఉత్తమ మైన
బ్రాహ్మణుడవు. ఏమిచేసినా నీకే చెల్లింది. సమస్తలోకములను హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేసావు. ఎలాగంటే, ప్రతి రోజూ వేదములో
చెప్పబడిన నిత్యనైమిత్తికబలి విధానములలో బ్రాహ్మణుల చేత నాలో వేల్చబడిన హోమద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకొని పోయి
దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కానీ నీవు ఇచ్చిన శాపం ప్రకారము నేను సర్వభక్షకుడినైతే నేను అపవిత్రుడిని అవుతాను. ఇంక నాకు హవిస్సులను తీసుకొని పోయి దేవతలకు,పితరులకు ఇచ్చే అర్హత లేదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించి పోతుంది.” అని అన్నాడు అగ్ని.
వెంటనే అగ్ని దేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు (ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం) జ్వలించడం మాను కున్నాయి. దేవ క్రతువులు, యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రము లేకపోవడంతో ఉదయం, సాయంత్రం చేసే ఔపోసనాది కార్యములు ఆగి పోయాయి. దేవతార్చనలలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జనమంతా