శుకుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకొని బయట కు వస్తే తను చచ్చి పోతాడు. మరల తను బత కాలంటే కచునికి మృత సంజీవని విద్య రావాలి. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువు గారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయట కు వచ్చాడు. శుకుడు చనిపోయాడు. కచుడు మృత సంజీవని విద్య చేత శుకుని బతికించాడు. ఆ విధంగా కచుడు శుకుని వలన మృత సంజీవని విద్యను సంపాదించాడు.
కొంత కాలం గడిచింది. వచ్చిన పని అయి పోయింది కాబట్టి ఇంక తను వెళ్లి పోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు కాని దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్లి పోతాడు అనే మాట విని ఏడ్చింది.
కచుని చూచి “నీకు పెళ్లి కాలేదు. నాకూ పెళ్లి కాలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి వలన నువ్వు మృత సంజీవని విద్య స్వీకరించా వు. ఆయన కు మార్తెనైన నన్ను కూడా స్వీకరించు” అని
అడిగింది.
దాని కి కచుడు “అమ్మా దేవయాని. నీ తండ్రి నాకు గురువు. అన గా నాకు పితృ సమానుడు. ఆయన పుత్రిక వు నువ్వు నాకు సోదరీ సమానురాలవు. ఇది ధర్మం. అందు వల నన్ను పెళ్లి చేసుకోమనడం నీకు తగదు.” అని అన్నాడు.
దానికి దేవయాని కోపించి “అప్లిన నా తండి వలన నువ్వు పొందిన మృత సంజీవని విద్య నీకు పని చేయదు” అని శాపం ఇచ్చింది..
కచుడు దే వయానిని చూచి ” సోదరీ, మృత | A సంజీవని నాకు పని చెయ్యక పోయినా, నేను
మరొకరికి ఉపదేశిస్తే, వాళ్ల కు పని చేస్తుంది కదా. కాని నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి, నన్ను పెళ్లాడ మని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు” అని ప్రతి శాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్లి పోయాడు.
(ఇక్కడ మనం ఒక విషయం గ మనించాలి. ఈ రోజుల్లో, school or college students వాళ్ల కు విద్య చెప్పే గురువులైన lecturers ను ప్రేమించడం ఒక ఫాషన్ అయి పోయింది. వీటి మీద సిని మాలు కూడా వస్తున్నాయి. అంటే ఒక అమ్మాయి తనకు చదువు చెప్పే గురువును ప్రేమిస్తుందంటే తన తండి నే కా మిస్తున్నదని అర్ధం ఇది తప్పు అనీ, చెయ్య కూడదనీ, అధర్మమని ఈ నాటి యువకులకు,
యు వతులకు తెలియదు.చెప్పే వాళ్ళూ లేరు. వినే వాళ్లు అంత కన్నా లేరు. కొన్ని వేల ఏళ్ల క్రితం ఈధర్మం ఉందని కచుని కధ వలన మన కు తెలుస్తూ ఉంది. ఈ విషయం ఈ నాటి విద్యార్ధులకు, వారి గురువులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభి పాయ ము).
ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట, గురువు గారి కూతురు దేవయాని తోనూ, తన వెయ్యి మంది పరిచారికలతోనూ విహారానికి అడవికి వెళ్లింది. అక్కడ ఒక కొలనులో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జల కాలాడుతున్నారు. ఇంతలో గట్టి గా సుడి గాలి వీచింది. ఆ గాలి కి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసి పోయాయి.
తరువాత శర్మిష్ట , దే వయాని , మిగిలిన పరిచారికలు కొలనులో నుండి బయట కు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో, దేవయానిబట్టలు శర్మిష్ట వేసుకుంది. కాని శర్మిష్ట బట్టలు మాత్రం దే వయాని వేసు కోలేదు.
“నేను నీ తండ్రి కి గురువు గారైన శుకుని కూతురిని. బ్రాహ్మణ కులం లో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను వేసుకుంటానా” అని అడిగింది. దా నికి శర్మిష్ట కు కోపం వచ్చింది.
“నీ తండి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బాహ్మణుడు. ఆ బాహ్మణుడి కూతురి వి నువ్వు గొప్పదాని వా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టు కోగా లేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టు కోవా?” అని నిందించి, దే వయానిని ఒక పాడు బడ్డ నూతి లో తోసింది. తరువాత తన పరిచారికలతో వెళ్లి పోయింది.
యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన చేతిని అందించి పైకి లాగాడు. దేవయాని పైకి వచ్చింది.
“వనితా, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు?” అని అడిగాడు.
దాని కి దే వయాని “మహారాజా, నా పేరు దేవయాని. రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్ర మాద వశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చెయ్యి పట్టు కొని పైకి వచ్చాను” అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్లి పోయాడు.